Sunday, January 18, 2009

గెలుపు మాదే....

న్యూఢిల్లీ, జనవరి 17(మేజర్‌ న్యూస్‌) : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చిందుకే ఢిల్లీ వచ్చినట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చెప్పారు. తెలంగాణపై కాంగ్రెెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి వెఎస్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై మొయిలీ ఏమన్నారో తనకు ఖచ్చితంగా తెలియదన్నారు. ఈ అంశంపై రాజధానిలో దుమారం రేగినప్పటికీ ఆయన తొణికినట్టు కనిపించలేదు. మొయిలీ వ్యాఖ్యలతో కా్రంగెస్‌ సీనియర్లు తీవ్ర ఆందోళనతో ఉన్న విషయాన్ని వైఎస్‌ తేలికగా కొట్టిపారేశారు. తెలంగాణా అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాకుండా ముందుకు పోతారా అన్న ప్రశ్నకు డోంట్‌ వర్రీ అని వైఎస్‌ సమాధానం చెప్పారు. మహా కూటములు, మెగా కూటములు కాంగ్రెెస్‌ను ఏమీ చేయలేవని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఒలింపిక్‌‌సలో గోల్‌‌డ మెడల్‌ తమదేనని, మిగతా పార్టీలు రజత, కాంస్యాలకు పోటీపడవలసిందేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం తాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిసి సత్యం వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని వెల్లడించారు.

అయితే వైఎస్‌ ముందు అనుకున్నట్టుగా తెలంగాణ తదితర రాజకీయ అంశాలపై చర్చించేందుకే ఢిల్లీకి రాలేదని తెలుస్తోంది. ఏఐసిసిలో ఆదివారం కోర్‌ కమిటి సమావేశం ఉందని, అందులో పాల్గొనడానికే ఆయన ఇక్కడికి వచ్చారని అంటున్నా అందులో కూడా వాస్తవం లేదని తెలుస్తోంది. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే దేశరాజధానిలో ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన మహాకూటమి శక్తియుకులు, సైద్ధాం తిక నిబద్దతపై అనుమానాలు వ్యక్తం కావడం. తెలంగాణా సాధించడానికి ఈ కూటమి ఏర్పడిందనే అభ్రిపాయంతో ఏకీభవించేవారు ఎక్కువగా లేరని కొందరు నేతల మాటలను బట్టి తెలుస్తోంది.

కాగా, ముఖ్యమ్రంతి వైఎస్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అ„హ్మద్‌ పటేల్‌ తదితర నాయకులను కలువనున్నారు. సోమవారం వరకు వైఎస్‌ ఇక్కడే ఉండే అవకాశమున్నందున వివిధ మంత్రిత్వశాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై పలువురు మ్రంతులను కలిసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment