Saturday, January 17, 2009

కొత్తరాజకీయానికి లోకసత్తా వేదిక

కుల నిర్మూలన దిశగా చేస్తున్న కొత్త రాజకీయానికి లోక్‌సత్తా వేదికగా మారుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, ఎస్‌. మనోరమలు తెలిపారు. రిజర్వేషన్లను రాజకీయ లబ్దికోసం కాక ఒక్కతరం కాలంలో కులనిర్మూలన కోసం వినియో గిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా పోరాడుతున్న లోక్‌సత్తా పార్టీపట్ల ఆకర్షితులై బీసీ సంఘాలు, నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరనున్నారని వారు చెప్పారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరనున్న బీసీ నేతల వివరాలను, వారితో కలిసి చేయ బోయే ప్రచార పంధాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని వారు తెలిపారు.

1 comment:

  1. yes definetly loksatta will create history in politics with silent revolution in politics

    ReplyDelete